విద్యుదాఘాతంతో యువ రైతు మృతి | The young farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Dec 6 2015 2:00 PM | Updated on Sep 5 2018 2:26 PM

వైఎస్సార్ జిల్లా కాశీనాయన మండలం కెఎన్ కొట్టాల గ్రామంలో విద్యుదాఘాతంతో ఆదివారం ఒక యువరైతు మృత్యువాత పడ్డాడు.

వైఎస్సార్ జిల్లా కాశీనాయన మండలం కెఎన్ కొట్టాల గ్రామంలో విద్యుదాఘాతంతో ఆదివారం ఒక యువరైతు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన బత్తల చలపతి(30) ఆదివారం ఉదయం పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లాడు. మోటార్ అన్ చేసేందుకు స్విచ్ ముట్టుకోగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన తోటి రైతులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోయింది. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement