సబ్సిడీల భారం తగ్గించుకొనేందుకు
కొత్త ప్రభుత్వం ఆధార్ మంత్రం జపిస్తోంది. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పినా అవేమీ పట్టనట్టు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎన్నికల సమ యంలో హామీలు గుప్పించిన టీడీపీ అధినేత వాటిని అమలు చేసే దారి లేక సతమతమవుతున్నారు. లబ్ధిదారులను కుదించి సంక్షేమ పథకాల భారం దించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: జిల్లాలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులను ఆధార్తో ముడిపెట్టింది. ఆధార్తో అనుసంధానమై వున్న రేషన్ కార్డుల లబ్ధిదారులకు మాత్రమే ఇకపై నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే ప్రక్రియ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయడం ప్రారంభించింది.
జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను అధికారులు దాదాపు 65 శాతం పూర్తి చేశారు.ఈ నెలాఖరుకు నూరు శాతం పూర్తి చేసేందుకు ప్రణాళిలు సిద్ధం చేశారు.ఆధార్తో అనుసంధానం కాని కార్డుల్లోని సభ్యుల సంఖ్య 14,91,443గా ఉంది.
ఈ ప్రక్రియ ఫలితాలు విన్న బోగస్ రేషన్ కార్డుదారులు ఇప్పటికే హడలిపోతున్నారు. ఇకపై కార్డుల్లోని సభ్యుల సంఖ్య భారీగా తగ్గనుంది. జిల్లాలో ఇప్పటికే 29,130 బోగస్ రేషన్ కార్డులను అధికారులు తొలగించినట్టు సమాచారం.కార్డులో ఉన్న అందరి సభ్యుల పేర్లలను ఆధార్కు అనుసంధానిస్తారు. దీంతో వేర్వేరు కార్డుల్లో ఒకే సభ్యుల పేర్లు నమో దు అయితే తెలుసుకోనే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ ఆధార్ కార్డు పొందని వారికి ఆశనిపాతంగా మారనుంది. అయితే జిల్లా లో ఆధార్ కార్డుల నమోదు 99 శాతం పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆధార్తో అనుసంధానం చేయని పక్షంలో రేషన్ను నిలిపివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.అనుసంధాన ప్రక్రియ పూర్తయితే లక్షకు పైగా కార్డులు గల్లంతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం జిల్లాలో 19,393.544 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు ఇస్తున్నారు. అనుసంధానం పూర్తయితే ఇందులో 25 శాతం మేర కోత పడే అవకాశం ఉంది.
నెలాఖరులోపు పూర్తి..
రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 65 శాతం పూర్తయింది. ఈ నెలాఖరుకు నూరుశాతం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
- యలమందరావు,
సహాయ పౌరసరఫరాల శాఖాధికారి,గుంటూరు.
సంక్షేమం భారం
Published Sat, Jul 19 2014 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement