కడప కార్పొరేషన్/వైవీయూ : జీవితంలో విజయం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ జి.వి.రవిశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని మయూర గార్డెనియాలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ప్రతినిధులు, ఫైనాన్సియల్ అడ్వైజర్లు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మదుపరులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు విచ్చేసిన జి.వి. రవిశేఖర్ మదుపరులను ఉద్దేశించి మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి సంపాదించిన సొమ్మును సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. చేసే పని ఏదైనా ప్రణాళిక ఉంటే విజయం సాధిస్తామన్నారు. అదే విధంగా తెలిపారు. సాధారణ ప్రజలు సైతం పెట్టుబడి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.
డబ్బు అందరికీ ప్రధానమేనని, అందరూ పనిచేసేది దానికోసమేనన్నారు. అయితే సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రణాళిక, లక్ష్యం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక మొబైల్, ఒక ఫ్రిజ్ కొనేటప్పుడు అందరినీ విచారించి కొంటారని, పెట్టుబడి మాత్రం ఆలోచించకుండానే పెట్టేస్తుంటారని ఇది సరైన విధానం కాదన్నారు. అలాగే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలా, పెట్టుబడి పెట్టాలా అన్న విషయంలో కూడా సందిగ్ధత నెలకొంటుందన్నారు. సెన్సెక్స్లో దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెడితే నష్టాలు రావన్నారు.
అనంతరం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శాంతి రాజ్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి, ఆదాయం, ఖర్చులు, పొదుపు ఎలా చేస్తున్నాం, పెట్టుబడి ఎందుకు పెట్టాలి, ఎలాంటి బీమా చేయాలి వంటి వాటి గురించి సుదీర్ఘంగా వివరించారు. సాక్షి కడప యూనిట్ ఇన్చార్జి నాగభూషణం మాట్లాడుతూ మదుపరుల అవగాహన సదస్సును మొట్టమొదటగా కడపలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు మదుపరులకు అవగాహన కల్పించడానికి ప్రదర్శించిన లఘునాటిక ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి ఉగ్రగిరి రావు, బ్యూరో ఇన్చార్జి ఎం. బాలక్రిష్ణారెడ్డి, సాక్షి ఏడీవీటి రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి, ఏడీవీటి జిల్లా ఇన్చార్జి చాముండేశ్వరి, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి పలువురు వ్యాపారులు, డాక్టర్లు, ఫైనాన్షియర్లు, పాల్గొన్నారు.
ఆర్థిక ప్రణాళికతోనే జీవితంలో విజయం
Published Mon, Apr 20 2015 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement