ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న టెట్ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ 3న ప్రభుత్వానికి ఫైలు పంపించింది.
గుంటూరు, న్యూస్లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న టెట్ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ 3న ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే అదే రోజు‘నెట్’ పరీక్ష ఉన్నందున ఈ మార్పు చేయాలని భావిస్తోంది. దీనిపై ఒకటీరెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెకండరీ విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరిలో డీఎస్సీ: మంత్రి పార్థసారథి
వచ్చే ఫిబ్రవరి 15నాటికి డీఎస్సీ పరీక్ష నిర్వహించి అదే నెల చివరల్లో ఫలితాలు ప్రకటిస్తామని సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.