ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం | Tamilnadu govt declares Rs 3 lakhs ex-gratia for Encounter death victims | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం

Apr 8 2015 4:47 PM | Updated on Sep 3 2017 12:02 AM

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.  

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement