సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో తుంగభద్ర నదిపై నిర్మించిన అతిపురాతనమైన సుంకేసుల బ్యారేజ్ ఏ ప్రాంతానికి చెందుతుందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, బ్యారేజ్ మొత్తం కర్నూలు జిల్లాలోని సుంకేసుల గ్రామ పంచాయితీ పరిధిలోనే ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని సీమాంధ్రకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ‘సుంకేసుల’ సరిహద్దుకు సంబంధించిన పూర్తి వివరాలతో వారు రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందాన్ని(జీఓఎం) కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. జీఓఎంకు సమర్పించేందుకు వారు ఒక సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో రిటైర్డు డీఈ వెంకట్రావు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. అయితే, వారికి రెండు మూడు రోజుల్లో తమను కలిసే అవకాశం ఇస్తామని జీవోఎం చెప్పినట్టు తెలిసింది.
అధికారుల వాదన ప్రకారం.. కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజక వర్గంలోని కర్నూలు మండలం.. మహబూబ్నగర్ జిల్లా, వడ్డెపల్లి మండలం మధ్యలో నిర్మించిన సుంకేసుల బ్యారేజ్ రెవెన్యూ రికార్డుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు, కడప జిల్లాల ఆయకట్టు రైతులకు సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. సుంకేసుల గ్రామ రెవెన్యూ సరిహద్దు.. బ్యారేజ్కి అవతలవైపున ఉన్న మహబూబ్నగర్ జిల్లాలోని రాజోలి గ్రామంలో ఉండేది. బ్యారేజీ అవతలివైపు ఉన్న భూములను సుంకేసుల గ్రామ రైతులే సాగుచేసేవారు.
1980 వరకు రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమెర సరిహద్దు రాయి ఉండేదని స్థానికులు చెపుతున్నారు. అయితే బ్యారేజి నిర్మాణానంతరం అవతలివైపు సుంకేసుల వాసులు సాగుచేసుకుంటున్న భూములు ముంపునకు గురయ్యాయి. ఇందుకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా తీసుకున్నట్లు ఆధారాలున్నాయని వారు వెల్లడించారు. సీమాంధ్ర రిటైర్డ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమ వాదనలకు ఆధారంగా బ్రిటిష్ కాలంనాటి రెవెన్యూ మ్యాప్లను చూపుతున్నారు. బ్రిటీష్ కాలంలో రామళ్లకోట తాలూకా ఉన్న సమయంలోని సుంకేసుల రెవెన్యూ సరిహద్దు మ్యాప్ ఆధారంగా తుంగభద్రనదిలో సుమారు 390 ఎకరాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
తెలంగాణదే అనడానికి ఆధారాలు లేవు
తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా సుంకేసులపై తమకు హక్కుందని వాదిస్తున్నారని ఆ రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. రాజోలిలోని కుమ్మరిగేరిలో సుంకేసుల పొలిమేర సరిహద్దు రాయి ప్రస్తుతం కనిపించకపోవడాన్ని తెలంగాణ వారు ప్రస్తావిస్తున్నారని, అయితే, వరదల్లో ఆ రాయి కొట్టుకుపోయి ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 1న సుంకేసుల జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చిన మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ బ్యారేజి సరిహద్దులపై కర్నూలు జిల్లాకు చెందిన అధికారులతో వాదించారు. అయితే ప్రాజెక్టు రిపోర్ట్, సుంకేసుల రెవెన్యూ గ్రామ సరిహద్దు రికార్డుల ప్రకారం బ్యారేజ్పై మహబూబ్నగర్ వారికి ఎటువంటి హక్కులేదని కర్నూలు జిల్లా అధికారులు వారికి వివరించారు.
సుంకేసుల బ్యారేజ్ నేపథ్యం
1861లో డచ్ కంపెనీ వారు వ్యాపార సౌలభ్యం కోసం తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టారు. ఆ తరువాత ఎన్టీ రామారావు 1985లో బ్యారేజీగా మార్చి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం 1998లో రూ.8కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో నిర్మాణం పూర్తయింది.
సుంకేసుల సీమాంధ్రదే..!
Published Fri, Nov 22 2013 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement