శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
సాక్షి, సిటీబ్యూరో: శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్, కాకినాడ, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, సిరిపూర్ కాగజ్నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, ఆదిలాబాద్, అకోల స్టేషన్ల నుంచి కొల్లాం వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 25 నుంచి ఉదయం 8 గంటలకు శబరి ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.