
పేరేచర్ల (గుంటూరు) : మేడికొండూరు మండల పరిధిలోని మంగళగిరిపాడు పొలాల్లో మంగళవారం నాలుగున్నర అడుగుల తెల్లతాచు కలవర పెట్టింది. పడగ విప్పి బుసలు కొట్టటంతో అక్కడున్న రైతులు పరుగు లంకించారు. గ్రామానికి చెందిన రైతు గుమ్మడిదల శివ తన పొలం గట్లపై పిచ్చిమొక్కలు కూలీతో తొలగింపజేస్తున్నారు. అలికిడికి తెల్లతాచు పాము అక్కడికి వచ్చింది. పడగ విప్పి బుసలు కొట్టింది. స్థానిక రైతుల సాయంతో దాన్ని చివరకు మట్టుపెట్టారు.