మహబూబ్నగర్ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ
అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు పాటించని 72 బస్సులను సీజ్ చేశారు.
కడప అర్బన్, న్యూస్లైన్ : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 45 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతూ బస్సులను సీజ్ చేయడం ప్రారంభించారు. కలెక్టర్ కోన శశిధర్ సంఘటన జరిగిన రోజే ఆర్టీఏ అధికారులతో సమావేశమై నిబంధనలు పాటించని ట్రావెల్స్ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆయా బస్సుల్లో భద్రతపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీటీసీ శ్రీకృష్ణవేణి అదేరోజు సాయంత్రం ట్రావెల్స్ యజమానులతో సమావేశమయ్యారు. కలెక్టర్ సూచించిన నిబంధనలు పాటించకపోతే రోడ్లపైకి తమ బస్సులను తీసుకురావద్దని నోటీసులు కూడా జారీ చేశారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు చెందిన 72 బస్సులను రోడ్డుపైకి రాకుండా చేశారు.
జిల్లాలో ట్రావెల్స్ బస్సుల పరిస్థితి
కడప, ప్రొద్దుటూరు పట్టణాలలో ప్రధానంగా 72 బస్సులు రాష్ట్రంలోని వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. వీరంతా కాంట్రాక్టు క్యారేజ్ పద్ధతిలోనే ట్యాక్సు కట్టి ప్రయాణీకులను మాత్రం స్టేజి క్యారియర్లుగా తరలిస్తున్నారు. ఏ బస్సులోనూ అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కనిపించకపోవడం గమనార్హం. ప్రతి బస్సులోనూ టన్నుల కొద్దీ లగేజీ తరలిస్తున్నా ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. స్మోక్ అలారమ్లు ఏర్పాటు చేయకపోవడం మరొక దుస్థితి. డ్రైవర్లు ఒక్కొక్కరే పనిచేస్తూ నెలకు లేదా రెండు నెలలకోసారి వారు మారడం, కొత్త డ్రైవర్లు రావడం జరుగుతోంది.
లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే..
జిల్లాలో 72 ట్రావెల్స్ బస్సులను నడపకుండా ఎందుకు నిలిపి వేశారని ‘న్యూస్లైన్’ డీటీసీ శ్రీకృష్ణవేణిని వివరణ కోరగా సంఘటనలు జరిగినపుడే కొత్త నిబంధనలు విధించాల్సి వస్తుందని తెలిపారు. ఇక నుంచి ప్రతి బస్సులోనూ ప్రయాణీకుడిని సీటు ముందు భాగాన సుత్తిని అమర్చాలని, లేకుంటే ప్రయాణీకులే సుత్తి తెచ్చుకోవాలని సూచనలు కూడా చేశామన్నారు. ట్రావెల్స్ యజమానులు నిబంధనలన్నీ పాటిస్తామని లిఖిత పూర్వకమైన హామీ ఇస్తేనే ఆయా బస్సులను నడిపేం దుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కలెక్టర్ సూచించిన నిబంధనలు
ట్రావెల్స్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు, అగ్నిప్రమాద నివారణ పరికరాలు అమర్చుకోవాలి.
డ్రైవర్లకు లెసైన్సుతోపాటు అనుభవమున్న ఇద్దరు డ్రైవర్లను, ఒక క్లీనర్ను నియమించుకోవాలి.
ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు ప్రయాణీకుల పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.
ప్రమాద, అత్యవసర సమయాల్లో వారి బంధులకు సమాచారం ఇచ్చేందుకు వారి నెంబర్లను నమోదు చేసుకోవాలి.
సామర్థ్యానికి తగ్గట్టే ప్రయాణీకులను ఎక్కించుకోవాలి.
ప్రతి బస్సు యజమాని తన సెల్ నెంబరుతోపాటు 24 గంటలు పనిచేసేలా టోల్ఫ్రీ నెంబర్లను బస్సులో కనిపించేలా ప్రదర్శింపజేయాలి.
ప్రతి బస్సులోనూ ఒక ప్రయాణీకుడికి 10 కిలోల లగేజీని మాత్రమే అనుమతించాలి. అధిక లగేజీని వేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రైవేట్ బస్సులు సీజ్
Published Sat, Nov 2 2013 3:28 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మియాపూర్లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
క్రాష్ టెస్ట్లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
తప్పక చదవండి
- నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
- పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి
- మస్కా మజాకా!
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- పోరాటం.. ఆరాటమే!
- విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
- ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్
- ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
- రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
- నడిరోడ్డులో ఈ బిల్డప్ అవసరమా? ఇంకెక్కడా చోటే లేదా బాస్?! వైరల్ వీడియో
Advertisement