ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆ సంస్థకే చెల్లిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆ సంస్థకే చెల్లిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైస్పీడ్ డీజిల్ వినియోగంపై ఆర్టీసీ రూ.115.99 కోట్ల మొత్తాన్ని ‘వ్యాట్’ రూపంలో చెల్లించింది. ఆ మొత్తాన్ని తిరిగి సంస్థకు చెల్లిస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. లక్ష్మీపార్థసారథి భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.