సంక్రాంతి సందర్భంగా జిల్లా నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సుల నిర్వాహకులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు.
నెల్లూరు సిటీ, న్యూస్లైన్: సంక్రాంతి సందర్భంగా జిల్లా నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సుల నిర్వాహకులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్కు ఓల్వో బస్సులో టికెట్ ధర రూ.760 కాగా గత వారం రోజులుగా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు.
గురువారం హైదరాబాద్కు టికెట్ రూ.1100 వసూలు చేశారు. శుక్రవారం ప్రయాణికుల రద్దీ అంతగా లేకపోవడంతో రూ.860తో సరిపెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో డిమాండ్ను బట్టి రూ.1100 నుంచి రూ.1500 వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పలు బ స్సుల్లో సీట్లు రిజర్వు అయ్యాయి.
బెంగళూరుకు రూ.675 వసూలు చేయాల్సి ఉండగా మూడురోజులుగా రూ.800 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. గత శని, ఆదివారాల్లో ఒక్కో టికెట్కు రూ.1300 వసూలు చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. రద్దీని బట్టి రానున్న రెండు రోజుల్లో జిల్లా నుంచి తిరుగు ప్రయాణమ య్యే వారి నుంచి అధిక ధర వ సూ లు చేసేందుకు ప్రైవేటు బస్సుల ని ర్వాహకులు సిద్ధమయ్యారు. ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకుంటూ బస్సులు నడుపుతున్నారు.