విద్యుత్ సంక్షోభంతో 28 రైళ్లు రద్దు | power supply stop in Andhra, 28 train services cancelled | Sakshi
Sakshi News home page

విద్యుత్ సంక్షోభంతో 28 రైళ్లు రద్దు

Oct 6 2013 4:28 PM | Updated on Sep 18 2018 8:41 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు.

కాజీపేట‌-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతి సెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. చెన్నై- పినాకిని ఎక్స్‌ ప్రెస్‌, విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. విజయవాడ- బిట్రగుంట, బిట్రగుంట- విజయవాడ, బిట్రగుంట - చెన్నై, చెన్నై - బిట్ర గుంట, చెన్నై-గూడూరు మధ్య నడవాల్సిన ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచిగూడ మీదుగా.. తిరుపతి - సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచిగూడ మీదుగా మళ్లించారు. సోమవారం లోగా విద్యుత్ పునరుద్ధరణ జరగకపోతే రైళ్లన్నీ ఆగిపోయే ప్రమాదముందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement