ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | person dies after being hit by rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Aug 23 2015 7:09 PM | Updated on Sep 3 2017 8:00 AM

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు.

రామచంద్రాపురం: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మండలం ఓగూరు వద్ద ఆదివారం బైక్‌పై వెళ్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుడు పశ్చిమగోదావరికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement