ఇకపై ‘టైగర్ రిజర్వ్’లో వాహనాలపై పన్ను | Now longer the 'Tiger Reserve' in the vehicles tax | Sakshi
Sakshi News home page

ఇకపై ‘టైగర్ రిజర్వ్’లో వాహనాలపై పన్ను

May 29 2014 1:04 AM | Updated on Oct 19 2018 7:22 PM

ఇకపై ‘టైగర్ రిజర్వ్’లో వాహనాలపై పన్ను - Sakshi

ఇకపై ‘టైగర్ రిజర్వ్’లో వాహనాలపై పన్ను

: నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్) లోకి రోడ్డు మార్గంలో ప్రవేశించే వాహనాలకు పర్యావరణ పన్ను విధించాలని అటవీ శాఖ నిర్ణయించింది.

హైదరాబాద్: నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్) లోకి రోడ్డు మార్గంలో ప్రవేశించే వాహనాలకు పర్యావరణ పన్ను విధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యంలోని రోడ్డు మార్గం ద్వారానే వెళ్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ కవర్లు వేయడంవల్ల పర్యావరణానికి మరీ ముఖ్యంగా వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతోంది.

పెద్ద సంఖ్యలో సిబ్బందిని పెట్టి ఈ చెత్తను తొలగించే మెకానిజం అటవీశాఖకు లేదు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు మెరుగైన చర్యలు తీసుకునేందుకు వీలుగా పర్యావరణ పన్ను విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. టైగర్ ఫౌండేషన్‌ను సొసైటీల చట్టం కింద రిజిష్టర్ చేసి ఈ మార్గంలో వెళ్లే భారీ వాహనాల నుంచి రూ.20, లైట్ వెహికల్స్ నుంచి రూ.10 చొప్పున పన్ను వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement