'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం | nit classes starts today | Sakshi
Sakshi News home page

'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం

Sep 10 2015 5:12 PM | Updated on Sep 3 2017 9:08 AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి.

తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో నిట్ శాశ్వత భవనం నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement