సీమాంధ్రను తాకనున్న నైరుతి రుతుపవనాలు | Niruti ruthupavanalu reaches coastal and rayalaseema with in 24 hours, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

సీమాంధ్రను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Jun 7 2015 1:52 PM | Updated on Sep 3 2017 3:23 AM

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకనున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. పశ్చిమ  మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తం ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement