ఏపీ గవర్నర్‌తో ఉన్నతాధికారుల భేటీ

Neelam Sahni And Gautam Sawang Meets Governor Biswabhusan Harichandan - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసినవారిలో ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ , డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖ అంశంపై వారు గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎస్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. ఈసీ లేఖ అంశాన్ని కూడా సీఎస్‌, డీజీపీలు గవర్నర్‌ వద్ద ప్రస్తావించారు. 

చదవండి : ‘కరోనా’పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

‘ఆ లేఖపై రమేష్‌కుమార్‌ మౌనం వీడాలి’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top