'అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు' | mp yv subbareddy slams cm chandrababu | Sakshi
Sakshi News home page

'అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు'

Mar 29 2016 12:53 PM | Updated on Aug 9 2018 4:30 PM

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు.

ఒంగోలు: ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దాదాపు 47 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నుంచి భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల స్పందన చూస్తే జిల్లా ఎంత వెనకబడిందో అర్ధమౌతోందన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల పట్ల లేదని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement