‘మైనార్టీ కార్పొరేషన్’ పాలక మండలి రద్దు నిలిపివేత | 'Minority Corporation' opt-out dissolution of the Governing Council | Sakshi
Sakshi News home page

‘మైనార్టీ కార్పొరేషన్’ పాలక మండలి రద్దు నిలిపివేత

Jun 28 2015 2:12 AM | Updated on Aug 31 2018 8:48 PM

‘మైనార్టీ  కార్పొరేషన్’ పాలక మండలి రద్దు నిలిపివేత - Sakshi

‘మైనార్టీ కార్పొరేషన్’ పాలక మండలి రద్దు నిలిపివేత

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలిని రద్దు చేస్తూ దాని స్థానంలో ఉన్నతాధికారులతో...

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలిని రద్దు చేస్తూ దాని స్థానంలో ఉన్నతాధికారులతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పా టైన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా ఓ బోర్డును ఏర్పాటు చేసింది.

దీనిని సవాలు చేస్తూ ఫైనాన్స్ కార్పొరేషన్ డెరైక్టర్లు సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ అన్వర్ భాషాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యా జ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పాలక మండలికి 2017 వరకూ కాల పరిమితి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పాలక మండలి రద్దు నిబంధనలకు విరుద్ధమనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ, ఉన్నతాధికారుల బోర్డు ఏర్పాటు జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement