‘ఛలో విజయవాడ కార్యక్రమం’లో ఉద్రిక్తత | Mid Day Meals Workers Arrested At Vijayawada | Sakshi
Sakshi News home page

‘ఛలో విజయవాడ కార్యక్రమం’లో ఉద్రిక్తత

Aug 6 2018 11:34 AM | Updated on Aug 29 2018 7:54 PM

Mid Day Meals Workers Arrested At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళా కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్న మహిళలను పోలీసులు బలవంతగా అరెస్ట్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మధ్యాహ్య భోజన కార్మికులు విజయవాడకు తరలివస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement