తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు | mentally chalenged person killed his family | Sakshi
Sakshi News home page

తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు

May 15 2015 10:10 PM | Updated on Oct 16 2018 4:50 PM

అచ్చం అలాంటి ఘటనే. బాలాపూర్లో జరిగిన దారుణ సంఘటన తీరుగానే మరో దారుణం. అనంతపురం జిల్లాలో కంబదూరులో పాశవిక ఘటన చోటుచేసుకుంది.

అనంతపురం(కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. సోమశేఖర్(40) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తల్లి, భార్యా, కుమార్తెలను పాశవికంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ(54), భార్య రామాంజమ్మ(34), కుమార్తె చిన్ను(4) అక్కడిక్కడే మరణించారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement