ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటన | Lokesh end of America tour | Sakshi
Sakshi News home page

ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటన

May 15 2015 2:28 AM | Updated on Aug 29 2018 3:37 PM

ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటన - Sakshi

ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటన

‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు’ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయడం, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే ..

హైదరాబాద్: ‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు’ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయడం, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నిర్వహించిన అమెరికా పర్యటన ముగిసింది.

ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పర్యటన విజయవంతమైనట్లు ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా లోకేశ్ 7 నగరాల్లో 5 వేల మందికిపైగా ఎన్నారైలతో, ఒబామా మొదలు బాబీ జిందాల్ వరకు ప్రముఖులతో వరుస భేటీలు, సమావేశాలు నిర్వహించారని చెప్పారు. కాగా లోకేశ్ శుక్రవారం హైదరాబాదుకు చేరుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement