- ఒకే లారీని రెండు చోట్ల సీజ్ చేసిన పోలీసులు
- 15 రోజులుగా స్టేషన్ ఆవరణలోనే
తడ: సుమారు రూ.3 లక్షల విలువైన ధాన్యం 15 రోజులుగా లారీలోనే ముక్కిపోతున్నాయి. ఇప్పటికే వాసన వస్తోందని, ఇక పారబోయడం మినహా మరోదారి లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన రైతు గుమ్మా వెంకటేశ్వర్లు తన ధాన్యంతో పాటు పక్క రైతుల నుంచి కొంత ధాన్యం కొనుగోలు చేసి మిల్లులో విక్రయించేందుకు లారీలో బయలుదేరాడు. లారీలో 1010 రకానికి చెందిన రూ.3 లక్షల విలువైన 255 బస్తాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఆరబెట్టుకునేందుకు సరైన వసతి లేకపోవడంతో కోత కోసిన వెంటనే అమ్ముకునేందుకు మిల్లుకు తరలిస్తున్నానని, లారీని విడిపించాలని జాయింట్ కలెక్టర్, డీఎస్ఓలకు మొరపెట్టుకున్నాడు. వారు స్పందించి ధాన్యం విక్రయానికి సంబంధించిన ధృవపత్రాలను తీసుకుని లారీని విడిపించాలని ఎస్పీకి సిఫార్సు చేయడంతో లారీ విడులైంది. అప్పటికే పది రోజులు గడిచిపోవడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో మిల్లర్లు కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. దీంతో రెడ్హిల్స్లో విక్రయించాలని భావించి బయలుదేరాడు. అయితే అదే లారీని 23వ తేదీ రాత్రి తడ సమీపంలో ఎస్బీ పోలీసులు సీజ్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. అప్పటి నుంచి లారీ స్థానిక స్టేషన్ ఆవరణలోనే ఉండడంతో ధాన్యం ముక్కిపోతోంది.
మూడు సరుకుల లారీల సీజ్
బీవీపాళెం(తడ): ఎలాంటి బిల్లులు లేకుండా తమిళనాడు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన మూడు సరుకుల లారీలను అధికారులను సీజ్ చేశారు. చెక్పోస్టులో తనిఖీ చేయించుకోకుండా వెళ్లిపోతున్న రెండు ఐషర్ లారీలను ఏఓ మల్లికార్జునరావు వెంబడించి పూడి వద్ద పట్టుకున్నారు. ఒక లారీలో రూ.1.67 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు, మరోలారీలో రూ.1.63 లక్షల విలువైన ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్కు తీసుకెళుతున్నామని డ్రైవర్లు చెబుతున్నప్పటికీ విజయవాడకు వెళుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో చెన్నై నుంచి నెల్లూరుకు వెళుతున్న ఓ లారీని తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేని రూ.8.22 లక్షల విలువైన ఊర్వశి సబ్బుల లోడు గుర్తించారు. కుక్కర్లకు 5 శాతం, సబ్బులకు 14.5 శాతం పన్ను విధించడంతో పాటు అంతే మొత్తంలో జరిమానా విధిస్తామని ఏఓ మల్లికార్జునరావు తెలిపారు.
లారీలోనే ముక్కిపోతున్న ధాన్యం
Published Sun, Sep 28 2014 3:13 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement