మస్తాన్ వలీతో ప్రాణహాని | i have death fear from mastan vali | Sakshi
Sakshi News home page

మస్తాన్ వలీతో ప్రాణహాని

May 18 2015 3:38 AM | Updated on Sep 3 2017 2:14 AM

ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో తనకు ప్రాణహాని ఉందని సినీనటి నీతూ అగర్వాల్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆమె వచ్చారు.

రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో తనకు ప్రాణహాని ఉందని సినీనటి నీతూ అగర్వాల్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆమె వచ్చారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తనను చంపుతామంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాలుపడుతున్నారన్నారు. ఆ వ్యక్తుల పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు.తనకు ఏదైనా ప్రమాదం జరిగితే మస్తాన్, అతని కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.   ఎర్రచందనం కేసులో తాను నిర్దోషినని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement