
ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని...
ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను, పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు.
సికింద్రాబాద్: ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను, పిల్లలను బయటకు గెంటివేశాడు. తుకారాంగేటు ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారని తన భర్త మహేష్ తనను, తన పిల్లలను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు.
భర్త మహేష్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమె రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతోంది. ఇది కుటుంబ సమస్య అయినందున తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు ఆమెకు చెబుతూ వచ్చారు. పోలీసులు స్పందించకపోవడంతో పిల్లలతోపాటు ఆమె పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించింది.ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో పోలీసులు స్పందించారు. మహేష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అతనికి కౌన్సిలింగ్ ఇప్పించే ఆలోచనలో ఉన్నారు.