అరుదైన దేవాలయం.. ఆదరణేదీ? | Historic Temple Has No Development In West Godavari | Sakshi
Sakshi News home page

అరుదైన దేవాలయం.. ఆదరణేదీ?

Jun 12 2019 10:18 AM | Updated on Jun 12 2019 10:18 AM

Historic Temple Has No Development In West Godavari - Sakshi

దేవాలయం ముందు భాగంలో 1860లో నిర్మించిన ధ్వజస్తంభం

సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): మండలంలోని అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం దేశంలోనే అరుదైనది. ఇలాంటి ఆలయం కోల్‌కతలో ఒకటి, ఆ తర్వాత మళ్లీ అన్నవరప్పాడులోనే ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెలిసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ పరశురాముడు పాలరాతి విగ్రహంలో ఉండగా, విగ్రహం చూస్తే మాత్రం బుద్ధుడు స్ఫురించడం విశేషం. పెద్దపెద్ద చెవులతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో  వివాహాలు చేసుకున్నవారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం అంటూ లేకున్నా ఏటా శ్రీరామనవమికి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి
మా తాత ముత్తాతల నుంచి ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. అయితే ప్రభుత్వ ఆదరణ లేక అభివృద్ధి చెందలేదు. ఇటువంటి అరుదైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. 
–వెలవలపల్లి విశ్వనాథం, అర్చకులు, అన్నవరప్పాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement