అప్పుల బాధ తాళలేక నేతన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మదనపల్లె: అప్పుల బాధ తాళలేక నేతన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొల్లబైలు పంచాయతి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి వెంకటరమణ(28) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.