ఇందూరు, న్యూస్లైన్ : విద్యార్థులకు అనుగుణంగా వార్డెన్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్ కూమార్ సూచించారు. బయటి పనుల్లో నిమగ్నమై వసతి గృహానికి వచ్చా మా... పోయామా అన్నట్లుగా ఉండొద్దన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమాధికారులతో, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, సౌకర్యాలను వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను వారికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వార్డెన్లపై ఉందన్నారు. కొత్తగా అమలు చేస్తున్న మెనూను పక్కాగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు ఉన్న భవనాల్లోకి మార్చాలని సూచించారు. అవసరమైతే గ్రామ సర్పంచ్, గ్రామ కమిటీ మెంబర్లతో మాట్లాడి భవనాలను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న వసతి గృహాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజురు చేయిస్తానని అన్నారు. ప్రతి వసతి గృహాంలో అవసరం ఉన్నచోట ఫ్యాన్,బల్బు కచ్చితంగా ఉండాలన్నారు.
కొందరు విద్యార్థులు సగం పగిలిన అద్దాల్లో చూసుకుంటున్నారని, వార్డెన్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కొత్తవి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, యూనిఫాంలు లేని విద్యార్థులకు వెంటనే అవి అందేలా సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాస్మోటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని పెండింగ్లో ఉంచవద్దన్నారు. విద్యార్థులకు వార్డెన్లు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని కారణం ఏంటనీ ప్రశ్నించగా, ఎవరూ సమాధానం చెప్పకపోడంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుంచి అన్ని స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిణి విమలను అదేశించారు. ప్రతి వార్డెన్కు ఒక సబ్జెక్టు వచ్చి ఉండాలని, పిల్లలకు రోజు ఒక గంట బోధించడం లేదా, సందేహాలను నివృతి చేయాలన్నారు. వారికి అన్ని మీరే అన్నట్టుగా ఉండాలన్నారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
చదువులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందించాలని తద్వారా వారిలో పోటీ తత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు,మెనూ ప్రకారం భోజనం,స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి వసతి గృహంలో ల్యాండ్ ఫోన్ ఉండాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుంటామని, దీంతో మీ పనితనం తెలిసిపోతుందన్నారు. మెస్,విద్యా,తదితర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని,నెలకు రెండు సార్లు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తనకు నివేదించాలని సూచించారు. వసతి గృహాలకు సరఫరా అవుతున్న రేషన్ బియ్యం సంచుల్లో తక్కువగా వస్తున్నాయని వార్డెన్లు జేడీకి ఫిర్యాదు చేయగా, అలాంటి బ్యాగులను వెంటనే సివిల్ సప్లయ్అధికారులకు అప్పగించి వేరే బ్యాగులను తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మైండ్ సెట్ మార్చుకోండి...
Published Sat, Sep 21 2013 4:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement