
‘పాము’ బంధువు లాకర్లో బంగారం గుట్టలు
రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్ను తెరవగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి.
మంగళవారం లాకర్ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.