పోలీసులు వేధిస్తున్నారంటూ..టవరెక్కిన యువతి | girl protests on cell tower in west godavari district over police harassesment | Sakshi
Sakshi News home page

పోలీసులు వేధిస్తున్నారంటూ..టవరెక్కిన యువతి

Apr 25 2016 9:13 AM | Updated on Aug 21 2018 7:39 PM

పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి సెల్‌టవరెక్కింది. తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్‌కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

తణుకు: పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి సెల్‌టవరెక్కింది. తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్‌కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆమెతో కలిసి అతను ఎక్కడికో వెళ్లిపోయాడు. సదరు యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నాగప్రసాద్ కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. తమను అకారణంగా పిలిపించి, వేధిస్తున్నారంటూ నాగప్రసాద్ సోదరి మీనా సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సెల్‌టవర్ పైకెక్కింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించటంతో ఆమె కిందికి దిగడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement