అగ్ని ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటన జిల్లాలోని కొల్లూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
అగ్ని ప్రమాదంలో బాలిక సజీవదహనం
Mar 20 2017 6:31 PM | Updated on Sep 5 2017 6:36 AM
కొల్లూరు (గుంటూరు): అగ్ని ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటన జిల్లాలోని కొల్లూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి కుమార్తె జ్యోతి (4) పిల్లలతో ఆడుకుంటూ తన మేనత్త అయిన చొప్పర శేషమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన జ్యోతి బయటకు వచ్చేలోపే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లోమంటలు చెలరేగాయి. బాలిక ఇంట్లో చిక్కుకుంది, మంటలు ఒక్కసారిగా ఇల్లంతా వ్యాపించడంతో స్థానికులు ఇంటి గోడను కూలగొట్టారు. అప్పటికే బాలిక పూర్తిగా మంటల్లో కాలిపోయి మృతి చెందింది.
Advertisement
Advertisement