మనస్తాపంతో రైతు ఆత్మహత్య


తనకు జీవనాధారమైన వ్యవసాయ భూమిని కొల్లగొట్టేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో మస్తానయ్య (70) అనే రైతు శనివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మస్తానయ్యకు 3 ఎకరాల వరకు పొలం ఉంది. అయితే, ఆ భూమి తమదంటూ బంధువులు పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించారు. అధికారులు కూడా వారికి సహకరిస్తుండడంతో మస్తానయ్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపింస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top