భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక.. | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక..

Sep 15 2015 4:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక.. - Sakshi

భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక..

భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

తలుపుల (అనంతపురం) : భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం చంద్రనాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన జావిలా నాయక్(38) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం.

అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలియడంతో తట్టుకోలేక జావిలా నాయక్ సోమవారం రాత్రి పొలంలో పురుగుల మందు తాగి పడిపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement