ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ | Encounter in Andhra-Odisha border | Sakshi
Sakshi News home page

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

Jun 4 2017 1:46 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ - Sakshi

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం పప్పులూరు పంచాయతీ కప్పసొడ్డి అటవీ ప్రాంతంలో

సీలేరు(పాడేరు): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం పప్పులూరు పంచాయతీ కప్పసొడ్డి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవా రుజామున ఒడిశా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని కలిమెల దళానికి చెందిన సీనియర్‌ కమాండర్‌ చిన్నబ్బాయిగా గుర్తించారు. సీలేరు రిజర్వాయర్‌ ఒడిశా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పప్పులూరు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా ముమ్మర కూంబింగ్‌ జరుగుతోంది.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, కాల్పుల్లో కలిమెల దళ సీనియర్‌ కమాండర్‌ మృతిచెందినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. చిన్నబ్బాయిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. అతి చిన్నవయస్సులోనే మిలీషియా సభ్యుడిగా చేరిన చిన్నబ్బాయి 25 ఏళ్లుగా ఉద్యమంలో ఉంటూ కీలక నాయకుడిగా ఎదిగాడు. 2007–08 మధ్యకాలంలో పోలీసులు పక్కా వ్యూహంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో చేరి నాగులూరు, కోరుకొండ, పప్పులూరు, కలిమెల, గాలికొండ, ఎల్లవరం దళాల్లో పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కలిమెల దళానికి కమాండర్‌గా ఉన్నాడు. అతని మృతదేహాన్ని ఒడిశా పోలీసులు పోస్టుమార్టంకోసం మల్కన్‌గిరికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement