నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా | district Issues to the attention of the assembly | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

Aug 18 2014 2:28 AM | Updated on Sep 2 2017 12:01 PM

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పేర్కొన్నారు. నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.

బద్వేలు: నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పేర్కొన్నా రు. నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టునుంచి నీరు ఇవ్వాలని కోరతామన్నారు. మూడేళ్లుగా నియోజకవర్గ రైతాంగం ఇబ్బంది పడ్డారని ఈ ఏడు పూర్తిస్థాయిలో ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలని  చెప్పారు.
 
పలు మండలాలలో ఉపాధి పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రజల సొమ్మును స్వాహా చేసిన వీరందరిపై విచారణ జరిగి చర్యలు తీసుకునేలా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని చెప్పారు. బెల్టుషాపులపై ఎక్సైజ్ శాఖ నియంత్రణ కోల్పోయిందని చెప్పారు.  దీంతోపాటు పలుసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement