తుర్కపల్లి న్యూస్లైన్ : వేర్వేరు కారణాలతో జిల్లాలో బుధవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో ఒకరు, ఆర్థిక సమస్యలతో ఇంకొకరు, మద్యానికి బానిసై మరోకరు బలవన్మారణానికి పాల్పడ్డారు. వివరాలు. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బెజ్జనబోయిన సత్తయ్య,అండాలు (49) వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి, ఇంటి నిర్మాణానికి అప్పు లు చేశారు. తమకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి సాగు చేయగా వరుస కరువుతో పంట చేతికందలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా అంతంత మాత్రమే. రుణదాతలు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన అండా లు తెల్లవారుజామున ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపునొప్పి ఎక్కువై కేకలు వేయడంతో కుటంబ సభ్యులు గమనించారు. చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్కలో మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉంది. మృతురాలి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ అభిలాష్ తెలిపారు.
ఉరివేసుకొని ఇద్దరు..
చౌటుప్పల్: చౌటుప్పల్కు చెందిన కొక్కు శేఖర్(35) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ దర్జీగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన శేఖర్ భార్య, పిల్లలను పట్టించుకోవడంలేదు. దీంతో భార్య పిల్లలను తీసుకొని, ఇటీవలే పుట్టింటికి వెళ్లి పోయింది. మనస్తాపానికి గురైన శేఖర్ మంగళవారం రాత్రి, ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. బుధవారం ఉదయం ఇరుగుపొరుగువారు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. ఇతని మృతిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణ శివారు చాకలిగిద్దె చెరువు సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువులు మేపేందుకు కాపరు లు అక్కడికి వెళ్లగా చెట్టుకు మృతదేహం వెలాడుతూ కని పించింది. దీంతోవారు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు పట్టణంలోని పాతగుండ్లపల్లికి చెందిన ఎస్ సత్తయ్య (45)గా గుర్తించారు. ఇతడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నా రు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
Published Thu, Sep 26 2013 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement