'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత' | daanam nagendar fires on modi | Sakshi
Sakshi News home page

'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత'

May 22 2015 8:23 PM | Updated on Oct 4 2018 6:57 PM

'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత' - Sakshi

'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత'

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వదిలి విదేశీ పర్యటనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు.

తిరుమల: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వదిలి విదేశీ పర్యటనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత దానం నాగేందర్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.

 

మోడీ నుంచి ప్రజలు ఎంతో ఆశీంచారని, కానీ ఆయన అనుకున్న విధంగా ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించారన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అధిక ధరలు పెరిగిపోయాయన్నారు. దీనివల్ల సామన్య ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement