ద్వారకాతిరుమల : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ విద్యుత్ సంస్థను ఆర్థికంగా దిగజారుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్ అన్నారు. ద్వారకాతిరుమలలోని ఓ కల్యాణమండపంలో గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘం నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని, అదనపు పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లకు ఒకసారి చేసే వేతన సవరణను ప్రభుత్వం సక్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు.
కాంట్రాక్టు కార్మికుల అర్హత ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా, ఇవి గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు 35 వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరిగిపోయిందన్నారు. వెయ్యి మంది వినియోగదారులకు నిబంధనల ప్రకారం నలుగురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1.91 మంది మాత్రమే ఉన్నారన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాన్ని 15 శాతం పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సూచనలిస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన 60 ఏళ్ల పదవీ విరమణ వయసును తమకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లా డి 8 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. దీనిపై స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా రూ.5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, నిత్యం ప్రమాదపుటంచున పని చేస్తున్న తమ శాఖ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందన్నారు. విద్యుత్శాఖలో ఖాళీ అయిన పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థల్లో పనిచేసే అన్స్కిల్డ్ కార్మికులకు రూ. 2,500 పెంచిన ప్రభుత్వం, తమ శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 3,500 లను పెంచి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. సంఘ రాష్ట్ర సలహాదారుడు ఎస్.శోభనాద్రి, రాష్ట్ర, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయాలి
Published Fri, Aug 7 2015 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement