కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు | CM YS Jagan Mohan Reddy Dinner On The 17th For Collectors And SPs | Sakshi
Sakshi News home page

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

Dec 15 2019 3:13 AM | Updated on Dec 15 2019 8:34 PM

CM YS Jagan Mohan Reddy Dinner On The 17th For Collectors And SPs - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్‌లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నట్లు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement