పెదకూరపాడు ఎమ్మెల్యే శంకరరావుకు మాతృ వియోగం

CM Jagan consoles YSRCP MLA Shankar Rao on his Mother death - Sakshi

సాక్షి, గుంటూరు : పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యేను పరామర్శించారు. ఇవాళ లక్ష్మీకాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top