చిరుత భయంతో పాఠశాలకు వెళ్లలేకున్న విద్యార్థులు | cheetah wandering in village premises | Sakshi
Sakshi News home page

చిరుత భయంతో పాఠశాలకు వెళ్లలేకున్న విద్యార్థులు

Jun 20 2015 6:16 PM | Updated on Sep 3 2017 4:04 AM

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదంగొల్లలదొడ్డి పల్లేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటేనే చిరుత భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది.

రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదంగొల్లలదొడ్డి పల్లేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటేనే చిరుత భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామం నుండి జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లాంటే విద్యార్థులు కొండ సమీపంలో నుండి వెళ్లాలి. అయితే గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. దీంతో వారు పాఠశాలకు వెళ్లడం మానేశారు. చిరుతపులి ఈ ప్రాంతంలో నాలుగు పశువులు, ఐదు మేకలను దాడి చేసి చంపేసింది. అటవీశాఖ అధికారులు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారేగానీ.. దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement