ఆగష్టు నెలాఖరుకల్లా రాజధాని ఖరారు: చంద్రబాబు | Capital city decided in August: Chandrababu | Sakshi
Sakshi News home page

ఆగష్టు నెలాఖరుకల్లా రాజధాని ఖరారు: చంద్రబాబు

Jul 12 2014 7:41 PM | Updated on Aug 18 2018 5:57 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

ఆగష్టు నెలాఖరుకల్లా ఏపీ రాజధానిని ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

విజయవాడ: ఆగష్టు నెలాఖరుకల్లా ఏపీ రాజధానిని ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రజలు  ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఏపి రాజధాని ప్రాంతాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఆగష్టులో నివేదిక ఇస్తుంది. ఆ తరువాత వారం పది రోజులలో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీలో జీతాలివ్వడానికే డబ్బులేదని చంద్రబాబు నాయుడు చెప్పారు.  భవిష్యత్తులో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  ఆదాయం వచ్చే ప్రాంతాన్ని తెలంగాణకు ఇచ్చార బాధపడ్డారు. త్వరలో మచిలీపట్నంలో పోర్టు నిర్మిస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement