అసెంబ్లీ ఘటనలపై బుద్ధప్రసాద్ కమిటీ సమావేశం
రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమన్న వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గత నెల 22న జీరో అవర్లో సభ్యులు ప్రస్తావించిన అంశాలతోపాటు వీడియో ఫుటేజీ లీకే జీపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన మరోసారి సమావేశమై, నివేదికను రూపొందించనుంది. మార్చి 1వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగా స్పీకర్కు నివేదికను అందించనుంది. కమిటీ సమావేశం మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. కమిటీ పలు వీడియోలను వీక్షించింది. శాసనసభ సమావేశాల దృశ్యాలు కొన్ని బహిర్గతం కావడంపై అధికారులను వివరణ కోరింది. దీనిపై అధికారులు స్పందిస్తూ అసెంబ్లీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలకు ఎలా చేరాయో తమకు తెలియదని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యురాలు ఆర్కే రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని ఆ పార్టీ తరపున కమిటీలో సభ్యుడైన శ్రీకాంత్రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం రోజాను ఆ సమావేశాల వరకూ, లేదంటే సమావేశాల్లో కొన్ని రోజులు మాత్రమే సస్పెండ్ చేయాలన్నారు. అయితే బుద్ధప్రసాద్ సహా మిగిలిన సభ్యులు మాత్రం రోజా సస్పెన్షన్ వ్యవహారం కమిటీ పరిధిలో లేదని అడ్డుకున్నట్లు సమాచారం. సభలో రోజా ఒక్కరే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్లుగా చిత్రీకరించడం సరికాదని శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రికార్డుల్లోకి ఎక్కేవిధంగా చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు, రికార్డుల్లోకి ఎక్కేందుకు వీలు కాకుండా చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది.
మార్చి 1లోగా స్పీకర్కు నివేదిక
Published Thu, Jan 28 2016 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement