నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి | A Boy Died With an Intestinal Worm Prevention Pills | Sakshi
Sakshi News home page

నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి

Aug 8 2019 5:28 PM | Updated on Aug 8 2019 5:29 PM

A Boy Died With an Intestinal Worm Prevention Pills - Sakshi

సాక్షి, విజయనగరం: చిన్న పిల్లలకు సంబంధించిన నులి పురుగుల నివారణ ముందు బిళ్లలు వికటించి రెండు సంవత్సరాలు బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలో కె. రామినాయుడు వలసలో జరిగింది. కడుపులో నులి పురుగులు పోవడం కోసం నానమ్మతో కలిసి అంగన్‌ వాడీ సెంటర్‌కి వెళ్లిన జస్విక్‌ నాయుడు ట్యాబ్లెట్‌ మింగిన పది నిమిషాలకు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పందించిన స్థానికులు బాలుడిని ఆటోలో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జస్విక్‌ అప్పటికే చనిపోయాడని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement