పులిగిలిపాడు క్వారీలో ప్రమాదం | Blasting in quarry at nellore district | Sakshi
Sakshi News home page

పులిగిలిపాడు క్వారీలో ప్రమాదం

Mar 31 2018 2:16 PM | Updated on Oct 20 2018 6:04 PM

Blasting in quarry at nellore district - Sakshi

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది.

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పులిగిలిపాడు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలో కూలిపనులకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన మహిళను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో క్వారీ వద్ద గాయపడిన మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement