కష్టాలను గుర్తించిన కమిషనర్‌ | Battery Vehicle Service in Nellore Corporation Office | Sakshi
Sakshi News home page

బాగుందే...

Jan 29 2020 1:18 PM | Updated on Jan 29 2020 1:18 PM

Battery Vehicle Service in Nellore Corporation Office - Sakshi

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాది మంది ప్రజలు వస్తుంటారు. వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, మహిళలు ఉంటారు. మెయిన్‌ రోడ్డు నుంచి లోనికి వచ్చేందుకు వారు ఇబ్బందులు పడేవారు. వారి కష్టాలను గమనించిన కమిషనర్‌ మూర్తి బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కమిషనర్‌ మూర్తి వాహనంలో కొంతసేపు ప్రయాణం చేశారు. ఈ వాహనం చాలా సౌకర్యంగా ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి కమిషనర్‌ను ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement