ఏపీ మున్సిపల్ కార్మికులు ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు.
మంత్రి మమ్మల్ని అవమానించారు: కార్మిక సంఘాలు
హైదరాబాద్: ఏపీ మున్సిపల్ కార్మికులు ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లపై చర్చల పేరుతో ప్రభుత్వం పలుమార్లు ఆహ్వానించి, అవమానించిందని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. పదేపదే చర్చల కోసం పిలిచిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తమను తీవ్రంగా అవమానించారని ఆరోపించింది.