ఎంపీ హర్షకు సమైక్య సెగ | Amalapuram MP Harsha Kumar samaka SEGA | Sakshi
Sakshi News home page

ఎంపీ హర్షకు సమైక్య సెగ

Dec 9 2013 3:33 AM | Updated on Sep 2 2017 1:24 AM

సమైక్యాంధ్ర పరిరక్షణ అంశంపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ వైఖరిని ప్రజలు నిరసించారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఆయనను వైఎస్సార్‌సీపీ,

సమైక్యాంధ్ర పరిరక్షణ అంశంపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ వైఖరిని ప్రజలు నిరసించారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఆయనను వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన ఘెరావ్ చేశారు. ‘ఈ రోజు రాష్ట్ర సమైక్యత కోసం నేను చేసిన ప్రకటన గురించి తెలుసుకుంటే మీరు నన్ను ఇలా ఘెరావ్ చెయ్యరు’ అని చెప్పినా సమైక్యవాదులు పట్టించుకోలేదు. మరోపక్క అమలాపురంలో జరిగిన రచ్చబండలో కూడా సమైక్యవాదులు నిరసన తెలిపారు. గొల్లవిల్లి రచ్చబండ అనుభవంతో హర్షకుమార్ అమలాపురం రాకుండా ముఖం చాటేశారు.              

Advertisement
 
Advertisement
Advertisement