కడప ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి!

ACB Officers Held Inspection On RTO Office In YSR Kadapa And Seized Rs 90310 - Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లా ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో 15మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి తొంభైవేల మూడు వందల పది(90,310) రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీవో కార్యాలయం సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికి తనీఖీలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top