
కన్నతండ్రి కర్కశత్వం
భార్య వేరొకరితో వెళ్లిపోయిందనే అక్కసుతో ముగ్గురు ఆడ పిల్లలకు కన్నతండ్రే పురుగుల మందు తాగించి బావిలోకి తోసేశాడు.
అతడి భార్య భాను సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుని 20 రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలేసి పరారైంది. ఇది తెలుసుకున్న పెంచలరత్నం రెండ్రోజుల క్రితం కువైట్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. భార్య వెళ్లిపోయిందన్న అక్కసుతో తన ముగ్గురు కుమార్తెలు హరిత(8), కీర్తి(6), ప్రేమ (4)లను గ్రామ సమీపంలోని దిగుడు బావి వద్దకు తీసుకెళ్లి, పురుగు మందు తాగించి.. హరిత, కీర్తిలను బావిలోకి తోసేశాడు. కాలనీవాసులు గమనించి ప్రేమను బావిలో పడవేయనివ్వకుండా అడ్డుకున్నారు. బాలికను వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.